21.6.13

మైదాపిండి బిస్కట్స్

మైదాపిండి బిస్కట్స్


కావలసిన పదార్థాలు:--
మైదాపిండి -- 3 కప్పులు
గోధుమనూక( బొంబాయి రవ్వ)-- 1 కప్పు
పంచదార -- 4 కప్పులు
ఉప్పు & వంటసోడా -- చిటెకెడు
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
ఒక డిష్ లో మైదాపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు & వంటసోడా వేసి, కొంచెం వేడి చేసిన నూనెను వేసి, నీరు పోస్తూ పూరీ పిండిలాగా కలిపి, ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పూరీ లాగా వత్తుకొని, మనకి ఇష్టమైన డిజైన్ లలో ముక్కలని కోసుకోవాలి. అన్నీ అయ్యిన తరవాత..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక, కొంచెం కొంచెం ముక్కల్ని నూనెలో వేస్తూ, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అన్నీ వేయించిన తరవాత, ఒక గిన్నెలో పంచదార వేసి కొంచెం నీరు పోసుకొని, ఉండ పాకం వచ్చాక వేయించి తీసుకున్న
బిస్కట్స్ ని పాకంలో వెయ్యాలి. అంతే... కమ్మగా.... నోట్లో వేస్తే కరిగిపోయే బిస్కట్స్ రెడీ....
తీపి ఇష్టంలేని వారు ఉప్పు --కారం వేసి చేసుకోవచ్చును.






No comments:

Post a Comment