21.6.13

పేపర్ దోశ

పేపర్ దోశ

కావలసిన పదార్థాలు
మినప్పప్పు -- 1 కప్పు 
బియ్యం -- 2 కప్పులు 
అటుకులు -- 1 కప్పు
ఉప్పు -- తగినంత
జీలకర్ర -- 1 స్పూన్
నూనె -- తగినంత  


తయారీ విధానం
మినప్పప్పు & బియ్యం 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. పప్పు రుబ్బే ఒక అరగంట ముందుగా అటుకులని కడిగి నానబెట్టి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, దోశని వేసుకొని, దోరగా కాలిన తరవాత తీసేయ్యటమే. పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే, పెనం మీద వేసేటప్పుడు గట్టిగా రుద్ది దోశని వేస్తె పల్చగా...... పేపర్ లాగా దోశ వస్తుంది. అంతే ఎంతో రుచిగా ఉండే పేపర్ దోశ రెడీ....... ఈ దోశకి పుట్నాలు +కొబ్బరి చట్నీ, సాంబారులతో కలిపి తింటే ఎంతో బావుంటుంది....




No comments:

Post a Comment