21.6.13

మసాలాదోశ

మసాలాదోశ

కావాలసిన పదార్థాలు
మినప్పప్పు -- 2 కప్పులు 
బియ్యం -- 4 కప్పులు 
ఉప్పు & నూనె -- తగినంత
మరమరాలు( మూరీలు) --2 కప్పులు
జీలకర్ర -- 1 స్పూన్

మసాలకూరకి కావలసిన పదార్థాలు
బంగాళదుంప -- 1/2 కేజీ
ఉల్లిపాయలు -- 1/4 కేజీ
ఉప్పు & పసుపు --తగినంత
గరం మసాలా పొడి -- 1స్పూన్
నూనె -- తగినంత .

కూర తయారీవిధానము
బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్కుతీసుకొని, ముద్దలాగా చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని & పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఉల్లిపాయ & పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేయించి, అందులో ఉడికించి, ముద్దచేసుకున్న బంగాయదుంపలని వేసి, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. ఒక గ్లాస్ నీరు పోసి ఇంకేంతవరకు ఉంచి దింపుకుంటే కూరకి మసాలా బాగా పడుతుంది. అంతే కూర రెడీ అయ్యింది, పక్కన ఉంచుకోవాలి......

దోశ తయారీవిధానం
మినప్పప్పు, బియ్యం & మెంతులు 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. పప్పు రుబ్బే ఒక అరగంట ముందుగా మూరీలని నానబెట్టి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, దోశని వేసుకొని, దోరగా కాలిన తరవాత, ఒక గరిట కూరని దోశమీద ఉంచి మడిచి తీసి, పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మసాలాదోశ రెడీ....... ఈ దోశకి పుట్నాల + కొబ్బరిచట్నీ, సాంబారులతో కలిపి తింటే ఎంతో బావుంటుంది....




No comments:

Post a Comment